Skip to main content

Posts

ఫ్లాప్స్ లేని హిట్ జంట వెంకటేశ్ మీనా - Venkatesh and Meena a hit pair

 సినిమాల్లో, కొంత మంది హీరో హీరోయిన్ల కి హిట్ జంట గా పేరు సంపాదిస్తారు. అలాంటి జంటల్లో ఒక జంట వెంకటేశ్ మీనా. వీరిద్దరు కలిసి 5 సినిమాలు చేసారు, ఆ ఐదు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.  1992 లో వచ్చిన చంటి సినిమా వీళ్ళీద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి హిట్ సినిమా. ఈ సినిమా తో వీరి విజయ పరంపర కొనసాగింది. తమిళం లో విజయం సాదించిన ఈ సినిమా ను తెలుగు లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు 4 నంది అవార్డ్లు రావటం గర్వించదగ్గ విషయం. ఈ సినిమాను హిందీ లో అనారీ అనే పేరు తో వెంకటేశ్ ను హీరో గా పెట్టి తీసారు.  అదే 1992 సంవత్సరం లో నే ఇంకొక సినిమా సుందరకాండ సినిమా కూడా రిలీజ్ అయ్యి ఘన విజయం సాదించింది.  ఈ సినిమా కూడా తమిళం లో విజయం సాధించిన సినిమాకు రీమేక్. ఈ సినిమా కు రాఘవెంద్ర రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కూడా హిందీ లో అందాజ్ అనే పేరు తో తీసారు. ఈ సినిమాలో అనిల్ కపూర్ హీరో గా చేసారు. 1993 లో వచ్చిన మరో హిట్ అబ్బాయి గారు. ఈ సినిమా కూడా తమిళం లో హిట్ అయిన సినిమా ను రీమేక్ చేసారు. ఈ సినిమా తెలుగు లో తీసే ముందే హిందీ లో రీమేక్ చేసారు. హిందీ లో బేటా అనే పేరు తో తీస
Recent posts

తెర పై కనిపించిన తెలుగు గాయకులు - Singers on screen appearence

 తెలుగు లో ఎంతో మంది గాయకులు ఉంటే, అందులో కొంతమంది తెర పై కనిపించారు. కొంతమంది తెర పై ఎవో పాటల కోసం కనిపిస్తే, కొంతమంది, నటన కూడా చేసారు. వారిలో కొంతమంది. ఎస్పీ బాలూ: ఈయన గురించి తెలియని వారంటూ ఉండరు. ఈయన పాడిన పాటలు ఎన్నో, జనరంజకంగా మారాయి. ఈయన పాటలు పాడటమే కాకుండా, సినిమాలు కూడా చేసారు. ఈయన సినిమాల్లో, చేసిన పాత్రలు కూడా, ప్రాధన్యత కలిగినవే. ఈయన చేసిన ఆఖరి సినిమా 2018 లో వచ్చిన దేవదాసు.  మనో: ఈయన పేరు నాగూర్ బాబూ. కానీ, మనో గా అందరికి సుపరిచితం. ఈయన పాడిన ఎన్నో పాటలు కూడా హిట్ అయ్యాయి. ఈయన పాటలు పాడటమే కాకుండా డబ్బింగ్ కూడా చెప్తారు.  ఈయన ఎక్కువగా రజినికాంత్ కి డబ్బింగ్ చెప్తారు. ఈయన కూడా ఎన్నో సినిమాల్లో, తెర పై కనిపించారు. ఈయన తెలుగు, తమిళ సినిమాల్లో, నటించారు. ఎస్పీ శైలజ: ఈవిడ గాయని గా ఎన్నో పాటలు పాడి స్రోతల మన్ననలు పొందారు. ఈవిడ్ అనటించిన సినిమా సాగర సంగమం. విశ్వనాథ్ దర్శకత్వం లో నటించిన ఈ సినిమాలో, శైలజ నటన కి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈవిడ శుభలేఖ సుధకర్ కి భార్య. దేవిశ్రీ ప్రసాద్: ఈయన మ్యూసిక్ డైరక్టర్ గానే కాకుండా పాటలు కూడా పాడారు. ఈయన కొన్ని సినిమాల్లో,

హాలీవుడ్ సినిమాల్లో కనిపించిన తెలుగు నటులు వీరే - Telugu artists in Hollywood movies

 మన తెలుగు నటులలో కొంతమంది హాలీవుడ్ సినిమాల్లో  (Hollywood Movies) నటించారు. వారిలో కొంతమంది ఇక్కడ శరత్ బాబు (Sarath Babu): ఈయన తెలుగు సినిమాల్లో, తనకంటూ ఒక ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. ఈయన ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటీంచారు. 2007 లో అమెరికా లో రిలీజ్ అయిన వాకింగ్ డ్రీంస్  (Walking Dreams) అనే సినిమాలో డాక్టర్ కుమార్ పాత్రలో కనిపిస్తారు.  నెపోలియన్ (Napoleon): ఈయన తెలుగు సినిమా హలో బ్రదర్ లో విలన్ పాత్ర వేసారు. ఈయనకి కూడా హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. 2019 లో అమెరికా లో రిలీజ్ అయిన క్రిస్టిమస్ కూపన్ (Christmas Coupon) అనే సినిమాలో ఏజంట్ కుమార్ అనే పాత్ర లో కనిపిస్తారు.  సుమన్ (Suman): ఈయన తెలుగు సినిమాలో ఎన్నో సినిమాలు చేసారు. ఈ మధ్య ఈయన ఎక్కువగా తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఈయన 2007 లో డెత్ ఎండ్  టాక్సీస్ (Death and Taxis) అనే హాలీవుడ్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఈయన ఒక 10 నుండి 15 నిముషాలు కనిపిస్తారు.  లక్ష్మీ మంచు (Manchu Lakshmi): ఈమె మోహన్ బాబు కుమార్తె గా కాకుండా, నటన తో తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఈమే కూడా 2 హాలీవుడ్ సినిమాలో చేసింది. 20

రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించిన నాగార్జున సినిమాలు ఫ్లాప్ - Nagarjuna movies turned flop when acted with Rajendra Prasad

నాగార్జున (King Nagarjuna)పేరు కి తగ్గట్టే మన్మదుడు అంటే, రొమాంటిక్ హీరో. రాజేంద్ర ప్రసాద్ (Comedy King Rajendra Prasad) ఏమో కామెడీ కింగ్. వీళ్ళ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక నాగార్జున కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించినవి మూడే సినిమాలు. ఆ మూడూ  ఫ్లాప్ గా మిగలడం తో మళ్ళీ కలిసి నటించే ప్రయత్నం చేయలేదు.  ఒక సినిమా కెప్టన్ నాగార్జున (Captain Nagarjuna). ఈ సినిమాకి వి బి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం (Direction V B Rajendra Prasad) వహించారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక ఆర్టిస్ట్ పాత్ర లో కనిపిస్తారు. ఈ సినిమా 1986 లో రిలీజ్ అయ్యింది. ఇది ఒక ఫ్లాప్ మూవీ గా మిగిలిపోయింది. 1986 లో రిలీజ్ అయిన మరో సినిమా అరన్య కాండ (Aranya Kanda). ఈ సినిమాకి క్రాంతి కుమార్ (Director Kranti Kumar) దర్శకత్వం వహించార్రు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక అడవి లో నివసించే వ్యక్తి పాత్ర లో కనిపిస్తారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలిపోయింది.  2001 లో వచ్చిన సినిమా ఆకాశ వీధిలో (Aakasa Vidhilo). ఈ సినిమా కి సింగీతం శ్రీనివాసరావు (Simgitham Srinivasa Rao) దర్శకత్వం వహించారు. ఈ సినిమాల

తన పేరే పాత్ర పేరు గా పెట్టుకుని చేసిన చిరంజీవి సినిమాలు - Chiranjeevi name it self as his Character names

 1980 లో మొగుడు కావాలి (Mogudu Kavali) అనే సినిమాలో, చిరంజీవి తన పేరు నే పాత్ర కి పెట్టారు. కట్టా సుబ్బారావు దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా లో చిరంజీవి (Megastar Chiranjeevi) హీరో గా చేసారు. అప్పటికి ఇంకా చిరంజీవి ఒక నటుడి గానే తెలుసు.  1982 లో వచ్చిన బంధాలు, అనుబంధాలు (Bandhaalu Anubandhaalu) సినిమా లో కూడా చిరంజీవి పాత్ర పేరు చిరంజీవే. ఈ సినిమాలో చిరంజీవి పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర చేసారు. ఈ సినిమా చిరంజీవి కి 50 వ సినిమా. ఈ సినిమా లో హీరో గా శోభన్ బాబు, చేస్తే, చిరంజీవి ఒక ంఖ్య పాత్ర లో కనిపించారు. 1982 లో వచ్చిన మరొక సినిమా అభిలాష (Abhilasha), ఇది యండమూరి (Yandamuri Novel) నవల ఆధారంగా తీసిన సినిమా. ఈ సినిమాలో కూడా, చిరంజీవి పాత్ర పేరు చిరంజీవే. ఈ సినిమాలో ఈయన లాయర్ పాత్ర లో కనిపిస్తారు. ఈయనకు జంటగా రాధిక చేసారు. ఈ సినిమాకు దర్శకుడు కోదండరామిరెడ్డి (Director A Kodanda Rami Reddy). ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్. 1985 లో వచ్చిన చిరంజీవి అనే సినిమాలో చిరంజీవి పాత్ర పేరు చిరంజీవే. ఈ సినిమా పేరు కూడా అదే కావటం విశేషం. ఈ సినిమాకు దర్శకుడు రాజేంద్రన్. ఈ సినిమాలో చిరంజీవి కి

తండ్రి కథలకు తనయుడి దర్శకత్వం - యస్ యస్ రాజమౌళి - SS Rajamouli directs father stories

ఇప్పటి వరకు రాజమౌళి 11 సినిమాలు తీసాడు, 12 వ సినిమాగా ఆర్ ఆర్ ఆర్ తీస్తున్నాడు. ఫ్లాప్ అంటే అర్దం తెలియని దర్శకుడు రాజమౌళి (Director S S Rajamouli).   ఈయన తీసిన చాలా సినిమాలకు, ఈయన తండ్రి, విజయేంద్ర ప్రసాద్  (K V Vijayendra Prasad) కథలు అందిస్తాడు.  సింహాద్రి (Simhadri )సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ రాయగా, రాజమౌళి దర్శకత్వం చేసారు. ఈ సినిమా ముందుగా బాలక్రిష్ణ తో తీయాలని అనుకున్నారు, కాని, ఆ తర్వాత, జూనియర్ ఎంటీఆర్ (Jr NTR) హీరో గా చేసి, ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. 2004 లో వచ్చిన సై (Sye) సినిమాకు కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించాడు. ఈ సినిమా అంతా రగ్బీ ఆట గురించి ఉంటుంది. 2005 లో వచ్చిన ఇంకొక సినిమా చత్రపతి (Chatrapati) ప్రభాస్ (Prabhas) కి మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా. ఈ సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే విక్రమార్కుడు, యమదొంగ, మగధీరా, బాహుబలి 1& 2 , ఇంకా షూటింగ్ లో ఉన్న ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలన్నింటికీ, విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈయన ఇచ్చిన కథలకు, రాజమౌళి, దర్సకత్వ ప్రథిభ తోడు అయ్యేసరికి ఈ

పునీత్ ని హీరో గా పరిచయం చేసిన పూరి - Director Puri Jagannath got a chance to introduce Puneet Rajkumar as Hero

హీరో పునీత్ రాజ్ కుమార్ (Puneet Rajkumar) మరణ వార్త అందరి హ్రుదయాలను కలిచివేసింది. 46 ఏళ్ళ వయసులో ఆయన సాధించిన కీర్తి అనిర్వచనీయం.  2002 లో అప్పు (Kannada Movie Appu) అనే సినిమా తో సాండల్ వుడ్ కి హీరో గా పరిచయం అయ్యారు. ఆ సినిమాను తెలుగు లో ఇడియట్ గా రీమేక్ చేసారు. అప్పు సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం  (Director Puri Jagannath)వహించారు. ఆ సినిమా విజయవంతం అయ్యింది. ఆ తరువాత పునీత్ రాజ్ కుమార్ వరుస హిట్లతో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. ఈయనను మొదటి సారిగా హీరోగా పరిచయంచేస్తూ దర్శకత్వం వహించే బాధ్యత పూరి కి దక్కటం పూరీ ఎంతో ఆనందించారు.  ఈయన చేసిన కన్నడ సినిమాలు, తెలుగులోకి కూడా రీమేక్ అయ్యాయి. అప్పు సినిమా ని తెలుగులో ఇడియట్ గా (Idiot - Raviteja and Rakshitha) రీమేక్ చేసారు. ఇడియట్ సినిమా ఇక్కడ కూడా విజయవంతం అయ్యింది.  2003 లో వచ్చిన అభి (Abhi) సినిమాను తెలుగు లో అభిమన్యు గా రీమేక్ చేసారు. అభిమన్యు కూడా తెలుగు లో హిట్ సాధించింది.  తెలుగు లో వచ్చిన ఆంధ్రావాలా, కన్నడ లో వీర కన్నడిగ (Veera Kannadiga) అనే పేరు తో రిలీజ్ అయ్యిన్ విజయవంతం అయ్యింది. తెలుగు లో వచ్చిన ఆంధ్రవాలా కు పూ

చిరంజీవి ని హిందీ కి పరిచయం చేసిన రవిరాజా పినిశెట్టి - Raviraja Pinisetty introduced Chiranjeevi in to Bollywood

 మెగా స్టార్ చిరంజీవి తెలుగు సినిమా రంగం లో తనకంటూ ఒక స్థాయి ని ఏర్పరుచుకున్నారు. 1983 లో ఖైదీ సినిమాతో మాస్ ప్రేక్షకుల మన్ననలు పొంది అప్పటి నుండి, సుప్రీం హీరో స్థాయి నుంచి, మెగాస్టార్ స్థాయి కి చేరుకున్నారు.  ఈయన ను హిందీ చిత్రసీమ కు పరిచయం చేసిన క్రెడిట్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కి దక్కింది. తెలుగు లో కోడి రామక్రిష్ణ దర్శకత్వం లో వచ్చిన అంకుశం ను హిందీ లోకి ప్రతిబంధ్ సినిమా గా రీమేక్ చేసారు. హిందీ సినిమాను దర్శకత్వం చేసే బాధ్యత దర్శకుడు రవిరాజా పినిశెట్టి కి దక్కింది. ఈ సినిమా ద్వారా హింది చిత్ర సీమ కి చిరంజీవి పరిచయం అయ్యి, జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ఈ సినిమా హిందీ లో కూడా విజయవంతం అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి పోలీస్ ఆఫీసర్ గా చేసారు, ఆయనకు గురువు గా సోమయాజులు చేసారు.  తెలుగులో రాజశేఖర్ నటించిన ఈ సినిమా హిందీ లో చిరంజీవి, హీరో గా పరిచయం అయ్యి, ఆయనకు జంట గా జూహీ చావ్ల చేసారు.  ఈ సినిమాకు చిరంజీవి కి ఉత్తమ నటుడి గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది.  

ప్రయత్నాలకు మారుపేరు దర్శకుడు సింగీతం - Singeetam Srinivasa Rao an experimental director

ఈ తరం యువత కు అంతగా పరిచయం లేని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. (Singeetam Srinivasa Rao) ఈయన మెగాఫోను పట్టి చాలా సంవత్సరాలే అయ్యింది. ఈయన చివరగా దర్శకత్వం చేసిన సినిమా 2013 లో వెల్కం ఒబామా (Welcome Obama).  ఈయన చేసిన సినిమాలలో చాలా వరకూ ప్రయోగాలే. ప్రయోగాత్మక సినిమాలన్నీ హిట్ సినిమాలే. 1972 లో నీతీ నిజాయితీ అనే సినిమా తో దర్శకుడు గా పరిచయం అయ్యి, తెలుగు, తమిళం, కన్నడ భాషలు అన్ని కలిపి 53 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన మాయబజార్ సినిమాకు సహాయ దర్శకుడు. 1987 లో పుష్పక విమానం (Pushpaka Vimanam) అనే సినిమాతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు సింగీతం. ఈ సినిమాలో డయాలగ్ అనేదే ఉండదు. ఇది మూకీ సినిమాగా ప్రఖ్యాతి గాంచింది. ఈ చిత్రానికి గానూ, సింగీతం గారికి ఉత్తమ దర్శకుడి గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ పొందారు. 1989 లో విచిత్ర సోదరులు (Vichitra Sodarulu) అనే సినిమా ద్వారా మరొక ప్రయోగం చేసారు.ఈ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసారు, ఒక కమల్ హాసన్ (Kamal Hasan) మాములుగా ఉండి, ఇంకొక కమల్ హాసన్ మరుగుజ్జుగా చూపించారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో కెమేరా ట్రిక్స్ తో కమల్ హాసన్ ను మరుగుజ్

వర్మ కరోనా వైరస్ - RGV Corona Virus Review

 వర్మ ఎప్పుడూ ప్రస్తుత పరిస్తితుల మీద సినిమాలు తీస్తుంటాడు. అల్ల వచ్చిన సినిమానే కరోనా వైరస్.  కథ తెర పైన చూసి తెలుసుంటేనే మజా గా ఉంటుంది. కాని మన ప్రధాని, కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఈ సినిమా మొదలవుతుంది.  మనకి అలవాటు లేని లాక్ డౌన్ పరిస్తితుల్లో, ప్రజలు పడ్డ ఇబ్బందులు, తర్వాత, కరోనా ఎక్కడ వ్యాపిస్తుంది అని ప్రజల్లో కలిగిన భయాన్ని, వర్మ బాగా చిత్రీకరించారు. ఒక మధ్య తరగతి కుటుంబం లో లాక్ డౌన్ తర్వాత, సామాజిక దూరం పాటించడం, కరోనా ఎక్కడ వ్యాపిస్తుందేమోనని భయం, అన్నవి తెర పై చూస్తే, మన మధ్యలో చాలా మంది కూడా ఆ సందర్భం లో అలగే ప్రవర్తించారు కదా అనిపిస్తుంది. వర్మ ఎప్పటిలాగానే లాగిక్లు ఇలాంటివి కాకుండా, ఒక కుటుంబం కరోనా వల్ల ఎలా బయపడింది అనేది చూడచ్చు. ఈ సినిమా టైంపాస్ కి ఒక సారి చూడచ్చు.

నిరాడంబరత చాటుకున్న అనుష్క శెట్టి - Anushka Shetty Simplicity

 అనుష్క శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పరిచయం అక్కరలేని నటి. తన కంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని, మున్ముందుకు దూసుకెల్తోంది. సినిమా రంగం లో ఎంత ఎత్తు ఎదిగిందో అంత నిరాడంబరంగా తన జీవితం ఉంటుంది. ఈ మధ్య, పశ్చిమ గోదావరి జిల్లలోని పోలవరం లోని ఒక గుడి లో పూజలు చేయించుకోవటానికి, మామూలుగా అందరి తో కలిసి పడవ లో వెళ్ళింది. ఈ సంఘటన చాలు ఆమె నిరాడంబరత చెప్పడానికి. మొఖానికి మాస్క్ పెట్టుకుని, అందరికి తోపాటు పడవ లో వెళ్ళింది, మొదట గుర్తు పట్టక పోయిన తర్వాత గుర్తు పట్టి, జనాలు ఫోటోలు తీసుకున్నారు. కింద వీడియో చాలు ఆమె వ్యక్తిత్వం తెలపటానికి. 

అరియానా నే నా సినిమా హీరోయిన్ - రాం గోపాల్ వర్మ - RGV offering a role to Ariyana in his next movie

 అర్యానా అనే పేరు బిగ్ బాస్ లోకి వచ్చే వరకూ చాలా మందికి తెలీదు. కాస్తో కూస్తో ఆట ఆడుతూ, ఆఖరి వారం వరకు వచ్చేసింది. ఈ వారం సేవ్ అయితే ఇక టాప్ ఫైవ్ కి వెళ్తుంది అరియానా.  ఇక అరియానా బిగ్ బాస్ లోకి రాక ముందు రాం గోపాల్ వర్మ తో ఒక ఇంటర్వ్యూ చేసి అందరి ద్రుషి లో పడింది.  ' ఆమె అడిగిన " మీకు ఈ మధ్య వావ్ అనిపించిన అమ్మాయి ఎవరు" అన్న ప్రస్న కు, వర్మ బదులిస్తూ నువ్వేనని చెప్పాడు. ఈ మధ్య కాలం లో ఒక ఇంటర్వ్యూ లో వర్మ మాట్లాడుతూ, అసలు తనకి బిగ్ బాస్ షో గురించి తెలీదని అది ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఆ సందర్బం లో అరియానా టాపిక్ రాగా, ఆమెను పెట్టి సినిమా తీయాలనుకుంటున్నట్టు, వర్మ తెలిపాడు. మరి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం అరియానా కు తెలిస్తే, ఎలా స్పందిస్తుందో చూడాలి. వర్మ డైరక్షన్ లో కాని, ఆయన నిర్మానం లో కాని నటించాలి అని చాలా మంది నటీ నటులు వువ్వీళ్ళూరుతూ ఉంటారు,  మరి అవకాశం తలుపు తట్టిన అరియానా ఆ అవకాశం వాడుకుంటుందో లేదో వేచి చూడాలి.